తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday

తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం



తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న అవకతవకలతో చెలరేగుతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఇంటర్‌ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్‌.. పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేస్తామని గురువారం (ఏప్రిల్ 24) ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌కు డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. 

ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను పునః పరిశీలిస్తామని బోర్డు పేర్కొంది. రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌నెట్‌ కేంద్రాల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరంలేదని బోర్డు తెలిపింది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి వస్తాయని పేర్కొంది. కాగా ముందు జాగ్రత్త కోసం ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages