ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి ఫలితాలు విడుదల (AP 10th Results) - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday

ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి ఫలితాలు విడుదల (AP 10th Results)



ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం (14-05-2019) ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్‌ సంధ్యారాణి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5%మంది పరీక్షలకు హాజరయ్యారు.
పదో తరగతి పరీక్షల్లో 94.88 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంధ్యారాణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. అందులో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక  ఎయిడెడ్‌ స్కూల్‌ ఉన్నాయి. ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. 83.19 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

 పలితాల కోసం క్రింద లింక్స్ క్లిక్ చేయండి: 


Results Link 1 : Click Here

Results Link 2 : Click Here

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages